January 17, 2025
News Telangana
Image default
Crime NewsTelangana

సైకిల్ ను ఢీ కొట్టిన ద్విచక్ర వాహనం

  • చికిత్స పొందుతూ గ్రామీణ వైద్యుడు మృతి

ఎండపల్లి, ఫిబ్రవరి 12 (న్యూస్ తెలంగాణ):

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం గుల్లకోటకు చెందిన గ్రామీణ వైద్యుడు (ఆర్.ఎం.పి) పత్రి గంగాధర్ (45) తన
వృత్తి లో భాగంగా ఫిబ్రవరి 4 ఆదివారం రోజున రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలో సైకిల్ పై ఇంటికి వెళ్తున్న సమయంలో స్థానిక బస్సు స్టాండ్ సమీపంలో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొనగా తలకు రక్తస్రావంతో కూడిన బలమైన గాయాలయ్యాయి. ఇది గమనించిన కుటుంబ సభ్యులు హైదరాబాదులోని గాంధీ హాస్పిటల్ కు తరలించారు. ఈ తరుణంలో చికిత్స పొందుతూ ఆదివారం రోజున మృతి చెందాడని, మృతుని కొడుకు రాకేష్ (20) ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వెల్గటూర్ మండల ఎస్సై కొక్కుల శ్వేత తెలిపారు.

0Shares

Related posts

ప్రశంస పత్రం అందుకున్న శంకరపట్నం ఎస్సై లక్ష్మారెడ్డి

News Telangana

అధికార పక్షానికి సహకరిస్తాం..తాతా మధుసూదన్

News Telangana

బరి తెగిస్తూ కొత్త రకంలో ఇసుక దందాకు పాల్పడుతున్న భూ బకాసురులు

News Telangana

Leave a Comment