హైదరాబాద్, డిసెంబర్ 17 ( న్యూస్ తెలంగాణ ) :-
తెలంగాణ రాష్ట్రంలోని మహా జాతర అయిన శ్రీ సమ్మక్క సారలమ్మ మేడారం జాతరపై మంత్రి సీతక్క సమావేశం నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా ఉదయం హైదరాబాద్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి రోడ్డు మార్గాన ములుగు జిల్లాకు బయలు దేరి ములుగులోని మహమ్మద్ గౌస్ పల్లి కి చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ములుగు గట్టమ్మ దేవాలయం లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం మధ్యాహ్నాం ములుగు గట్టమ్మ నుంచి రోడ్డు మార్గాన ర్యాలీగా బయలుదేరిన ఆనంతరం తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క సారలమ్మవన దేవతలను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. అనంతరం జిల్లా అధికార యంత్రాంగంతో మేడారం జాతరపై రివ్యూ మీటింగ్ నిర్వహిస్తారు
![Image default](https://newstelangana.in/wp-content/uploads/2023/12/IMG-20231213-WA0038.jpg)
previous post