January 17, 2025
News Telangana
Image default
Telangana

గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్

పెద్దపల్లి ( న్యూస్ తెలంగాణ ) :- తక్కువ సమయంలో లో ఎక్కువ డబ్బులు సంపాదించాలని దురాశతో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న వ్యక్తిని పెద్దపల్లి పోలీసులు బుధవారం అరెస్ట్‌ చేశారు.

నిందితుడి వద్ద నుంచి గంజాయి చాక్లెట్స్ స్వాధీనం చేసుకొన్నారు ఈ సందర్భంగా పెద్దపల్లి ఎస్‌ఐ మల్లేష్‌ మీడియాకు విరాలను వెల్లడించారు పెద్దపెల్లి పట్టణానికి చెందిన అన్సారీ అనే వ్యక్తి కష్టపడకుండా డబ్బులు సంపాందించాలని తప్పుడు మార్గాన్ని ఎంచుకున్నాడు.

ఇందుకోసం కాలేజీలు ఎక్కువగా ఉన్న ఏరియాలను టార్గెట్‌గా చేసుకొని ఉత్తరప్రదేశ్ నుంచి గంజాయి చాక్లెట్స్‌ తెప్పించి విక్రయిస్తున్నాడని తెలిపారు.

విశ్వసనీయ సమాచారం మేరకు బుధవారం పట్టణంలోని అమర్ నగర్‌లో నిందితుడిని అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పేర్కొన్నారు.

0Shares

Related posts

చెక్ పెట్టని “చెక్ పోస్ట్

News Telangana

సంక్రాంతి పండగ సందర్బంగా క్రికెట్ టోర్నమెంట్

News Telangana

కాంగ్రెస్ ప్రభుత్వం వస్తోంది.. వారంతా ఇప్పటికైనా మారాలి.. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

News Telangana

Leave a Comment