January 17, 2025
News Telangana
Image default
Telangana

ఖమ్మం జిల్లా కేంద్రంలో గంజాయి చాక్లెట్లు స్వాధీనం

ఖమ్మం జిల్లా , జనవరి 30 ( News Telangana ) :-
హైదరాబాద్‌ శివార్లలోని నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కోకాపేట ప్రాంతంలో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న ఉదంతం మరవక ముందే.. తాజాగా ఖమ్మం లో గంజాయి చాకెట్లు లభించడం ఆందోళన కలిగిస్తున్నాయి.

ఖమ్మంలో నిందితుల నుంచి మూడు కిలోల గంజాయి చాక్లెట్లను పోలీసులు ఈరోజు స్వాధీనం చేసుకున్నారు.కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా, హైదరాబాద్‌ శివార్లలోని నార్సింగిలో గంజాయి చాకెట్లు కలకలం సృష్టించాయి.

నార్సింగి పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కోకాపేట ప్రాంతంలో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న వ్యక్తిని ఎక్సైజ్‌ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుడిని ఒడిశాకు చెందిన సౌమ్యా రాజన్‌గా గుర్తించారు.

అతని నుంచి 40 గంజాయి ప్యాకెట్లను సాధీనం చేసుకున్నారు. భవన నిర్మాణ కార్మికులకు చాక్లెట్లను అమ్ముతుండగా పట్టుకున్నామని పోలీసులు తెలిపారు.

కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తు చేస్తున్నామని చెప్పారు. వాటిని ఎక్కడి నుంచి తీసుకొచ్చాడనే విషయమై ఆరాతీస్తున్నారు

0Shares

Related posts

దర్గాను దర్శించుకున్న ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మదన్ రెడ్డిలు

News Telangana

సాగర్ డ్యామ్‌ వద్ద భారీగా ఇరు రాష్ట్రాల పోలీసులు.. మరోసారి ఉద్రిక్తత

News Telangana

ఎగ్జిట్ పోల్స్ చూసి కంగారు పడొద్దు.. విజయం మనదే.. తేల్చి చెప్పిన కేటీఆర్

News Telangana

Leave a Comment