July 26, 2024
News Telangana
Image default
Telangana

తెలంగాణలో 32 మంది డిప్యూటీ కలెక్టర్లకు పదోన్నతి :ఆ పై బదిలీ

హైదరాబాద్ ( News Telangana ) :-
తెలంగాణలో స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం శనివారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది.

రాష్ట్రవ్యాప్తంగా 32 మంది డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ రెవెన్యూ ముఖ్య కార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

పలువురు అధికారులకు ప్రమోషన్లు ఇచ్చి బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. మరికొందరు డిప్యూటీ కలెక్టర్లు వెయిటింగ్‌లో ఉండగా పోస్టింగ్‌ ఇచ్చారు.

రాష్ట్రవ్యాప్తంగా 132 మంది తహసీల్దార్లను ప్రభుత్వం బదిలీ చేసింది. మల్టీజోన్‌-1, మల్టీజోన్‌-2లో తహసీల్దా ర్లను బదిలీ ఉత్తర్వులు జారీ అయ్యాయి.

మల్టీజోన్‌-1లో 84 మంది, మల్టీజోన్‌-2లో 48 మంది తహసీల్దార్లను బదిలీ చేస్తూ నవీన్‌ మిట్టల్‌ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, లోక్‌సభ ఎన్నికల నేపథ్యం లో ఎన్నికల కమిషన్‌ మార్గ దర్శకాల మేరకు తహసీల్దార్లను బదిలీ చేసినట్లు పేర్కొన్నారు

0Shares

Related posts

అక్రమ వసుళ్ళకి అడ్డగా మారిన కోదాడ సబ్ రిజిస్టర్ వారి కార్యాలయం ?

News Telangana

హైదరాబాద్ హెచ్ఎండిఏ కమిషనర్ : కాట ఆమ్రపాలి

News Telangana

న్యూస్ తెలంగాణ బ్యూరో పై మైనింగ్ శాఖ ఏడి వెటకారం..!

News Telangana

Leave a Comment