జహీరాబాద్, న్యూస్ తెలంగాణ : సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం బూచినెల్లి సమీపంలో ఓ కారు ప్రమావశాత్తు బోల్తా పడింది. ఘటనాస్థలిని పరిశీలించిన పోలీసులు కారులో 2 క్వింటాళ్ల గంజాయి పొట్లాలను చూసి అవాక్కయ్యారు. భద్రాచలం ఏజెన్సీ ప్రాంతాల నుంచి ముంబయికి గంజాయి తరలిస్తుండగా ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు ప్రమాదంలో గాయపడిన స్మగ్లర్లు కారు గంజాయిని అక్కడే వదిలేసి పరారైనట్లు వివరించారు వీటిని స్వాధీనం చేసుకొని చిరాగ్పల్లి ఠాణాకు తరలించామన్నారు ఘటనపై కేసు నమోదు చేసిన దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
![Image default](https://newstelangana.in/wp-content/uploads/2023/12/P-IMG-20231202-WA0015.jpg)