July 27, 2024
News Telangana
Image default
National

ఈ నెల 20న మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్.. ఎందుకంటే..?

News Telangana :- స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ వివో ‘స్విచాఫ్’ పేరుతో ప్రత్యేక ప్రచారాన్ని చేస్తుంది. డిసెంబర్ 20వ తేదీన తమ కస్టమర్లు అందరూ వారి స్మార్ట్‌ఫోన్‌లను స్విచ్ ఆఫ్ చేయాలని విజ్ఞప్తి చేసింది.ఈ నెల 20న రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు కస్టమర్లు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి తమ కుటుంబ సభ్యులతో సరదాగా గడపాలని కోరింది. కంపెనీ చేసిన ఓ సర్వేలో దాదాపు 77 శాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలు విపరీతంగా మొబైల్ యూస్ చేస్తున్నట్లు ఫిర్యాదు చేసినట్లు సంస్థ వెల్లడించింది. పెద్దవారికి సైతం ఫోన్ వ్యసనంగా మారిందని తెలిపింది. ఈ నేపథ్యంలోనే తల్లిదండ్రులు, పిల్లలకు మధ్య రిలేషన్ దూరం ఏర్పడితే భవిష్యత్తులో సమాజానికి నష్టం జరుగుతుందని ఈ స్విచ్ ఆఫ్ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.

0Shares

Related posts

నేటి నుండి శబరిమలకు వందే భారత్ రైలు !

News Telangana

నేటి నుంచి ఐదురోజుల పాటు ఆకాశంలో అద్భుతం

News Telangana

ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం రోజున మావోయిస్టుల పంజా

News Telangana

Leave a Comment