July 27, 2024
News Telangana
Image default
National

ఛ‌త్తీస్ గ‌డ్‌లో మావోయిస్టుల దాడి.. ఎస్ఐ మృతి

సుక్మా , డిసెంబర్ 17 ( న్యూస్ తెలంగాణ ) :-
చ‌త్తీస్‌గ‌డ్‌లో మావోయిస్టులు సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై ఆదివారం ఉదయం దాడికి పాల్ప‌డ్డారు. ఈ దాడిలో ఎస్ఐ సుధాక‌ర్‌ రెడ్డి అక్క‌డిక్క‌డే మృతి చెందాడు. ఆదివారం ఉదయం సుక్మా జిల్లాలోని బెద్రెలోవారాంతపు అంగడి లో సీఆర్‌పీఎఫ్‌ జవాన్లపై మావోయిస్టులు దాడిచేశారు. ఎస్‌ఐ సుధాకర్‌ రెడ్డి అక్కడికక్కడే చనిపోగా కానిస్టేబుల్‌ రాము తీవ్రంగా గాయపడ్డారు. ఆదివారం ఉదయం ఈ ఎన్‌కౌంటర్ చోటుచేసుకుంద‌ని, సుక్మా జిల్లా పోలీసులు సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా తెలిపారు. గాయపడిన రాముకు జవాన్లు ప్రాథమిక చికిత్స అందించారని అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం హెలికాప్టర్‌లో బెద్రెలోని ఆస్ప‌త్రికి తరలించామన్నారు

0Shares

Related posts

క‌రోనా కేసుల‌పై అప్ర‌మ‌త్తంగా ఉండండి… కేంద్ర ఆరోగ్య శాఖ సూచ‌న

News Telangana

అస్సాంలో నరేంద్ర మోడీ విగ్ర‌హం

News Telangana

ఈ నెల 20న మొబైల్ ఫోన్లు స్విచ్ ఆఫ్.. ఎందుకంటే..?

News Telangana

Leave a Comment