July 26, 2024
News Telangana
Image default
Telangana

లోకాయుక్తలో కేసు నడుస్తున్నప్పటికీ ఆగని ”మాజీ సర్పంచ్ భర్త” ఆగడాలు

  • పేద ల జీవితాలతో ఆడుకుంటూ కోట్లకు పడగలెత్తిన ప్రజాప్రతినిధి భర్త ?
  • “మాజీ మంత్రి” అండదండలతో యదేచ్చగా భూ కబ్జాలు చేసి భూ బకాసురుడిగా కోట్లకు పడగెత్తిన “మాజీ సర్పంచ్ భర్త” ఖమ్మం కి కుతవేటు దూరం లో వున్న ఉదయ్ నగర్ లో జరిగే ఈ బకాసురుడి భూ ఆక్రమణలు జిల్లా అధికారులకు తెలవనట్ల లేదా శ్రీ రామదాసు చిత్రంలో మంచు గడ్డను వలే అందరికి వాటా ఉన్నదా అని పలువురు అసహనం వ్యక్తం చేస్తున్నారు

ఉమ్మడి ఖమ్మం జిల్లా బ్యూరో, ఫిబ్రవరి 14 (న్యూస్ తెలంగాణ) :- ఖమ్మం జిల్లా రఘునాదపాలెం మండలంలో నీ పువ్వాడ ఉదయ్ నగర్ లో 2009.సం.లో ఇచ్చిన ప్రభుత్వ ఇండ్ల స్థలాల ఆక్రమ అమ్మకాలపై లోకాయుక్త సంస్థలో విచారణ జరుగుతున్నందున తక్షణమే ఆ అక్రమ ఇంటి నెంబర్లను నిశితంగా ప్రత్యేకంగా గుర్తించి రద్దుపరచుటతోపాటు కొత్తగా ఇంటి నెంబర్లు ఇచ్చే ప్రక్రియలు నిలిపివేయగలరు అని లోకాయుక్త నుంచి ఆదేశాలు వచ్చినప్పటికీ పట్టనట్టు వ్యవహరించిన అధికార యంత్రాంగం ఉదయ్ నగర్ లో నేనే రాజు నేనే మంత్రి గా వ్యవహరించి డబుల్ బెడ్ రూమ్ లలో పోయిన ఫ్లాట్లకి నేను ఫ్లాట్ ఇస్తా అంటూ పదుల సంఖ్యలో బాధితుల దగ్గర 20 నుంచి 30 వేలు మరి కొంతమంది దగ్గర 50 నుంచి లక్ష రూపాయల వరకు వసూలు చేసినట్లు విశ్వసనీయ సమాచారం ఇటు చూసుకున్నట్లయితే నాటికి కొందరు బాధితులకు ఫ్లాట్లు చూపియకుండా వారిని భయభ్రాంతులకు గురిచేసి అలా మభ్యపెట్టుకుంటూ వస్తున్నాడు ఆ మాజీ సర్పంచ్ అక్రమార్క భర్త ఇప్పటికీ ప్రభుత్వ ఇళ్ళ స్థలాలను అమ్ముతున్న అక్రమార్కడు వివరాల్లో కి వెళితే ఖమ్మం కి అనుకొని వున్న పువ్వాడ ఉదయ్ నగర్ కాలనీ కి చెందిన గ్రామ ప్రజా ప్రతినిధి ని చూసుకొని భర్త ఆగడాలు అంత ఇంత కాదు ఆ కాలనీలో నిరుపేదల కోసం ఇచ్చిన ఇళ్ళ స్థలాలను దొంగ పట్టాలు పుట్టించి ఒక్కో ప్లాట్ 3 నుంచి 4 లక్షల రూపాయల వరకు అమ్ముకుంటూ కోట్ల రూపాయలు దండుకున్నాడు పలు మార్లు అధికారుల దృష్టికి తీసుకు వెళ్లిన తన అనుచరులుగా వున్న వారి పేరు మీద అగ్రిమెంట్ పత్రాలు రాస్తూ కొన్ని వందల ఇళ్ళ స్థలాలను కొల్ల గొట్టాడు ఈ ప్రబుద్ధుడు ఎవరికి ఇచ్చే వాట వారికి ఇస్తూ అధికారులకు దొరకకుండా ఇష్టాను సారంగా బుములను అమ్ముతున్నాడు కొంత మంది ఆకతాయులకు మద్యం పోయించీ ఎస్సైండ్ భూముల యజమానులను బెదిరించి యకారం 4 లక్షలకు కొని ప్లాట్లు గా మార్చి కోట్ల రూపాయలు గడించాడు మమత హాస్పిటల్ దగ్గర్లో ఎన్ఎస్పి కాలవ మీద స్థలాన్ని ఆక్రమించి 4 అంతస్తుల భవనం నిర్మించాడు ఇప్పటికైన ఇలాంటి అక్రమార్క పై ఎంక్వైరీ వేసి కటినంగా శిక్షించాలని సామాన్య ప్రజలు పలువురు బాధితులు జిల్లా రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నీ కలిసి పిర్యాదు చేయడానికి రంగం సిద్ధం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. సర్పంచ్ భర్త తో పాటు ఇందులో భాగస్వామ్యలుగా ఉన్నటువంటి అధికారుల పై సైతం ఫిర్యాదు చేయడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం ఇప్పటికైనా జిల్లా అధికారులు కలెక్టర్ పి వి గౌతమ్ స్పందించి ఆ అక్రమార్కుడు పై తగిన చర్యలు తీసుకోవాలంటూ బాధితులు కోరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజా ప్రభుత్వం ప్రజాపాలనే ద్యేయంగా పనిచేస్తాం అంటున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోనైనా ప్రజలకి మంచి జరగాలని పలు ప్రజా ప్రజాసంఘాల నాయకులు ప్రజలు ఆనాటి బిఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినటువంటి ఈ అక్రమాలను ఇప్పటికైనా అరికట్టాలని కోరుతున్నారు. ఇదే చిత్తశుద్ధితో పువ్వాడ ఉదయ నగర్ అక్రమాలను అరికట్టి తగు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు

  • ( వెలుగులోకి వస్తున్న మాజీ సర్పంచ్ భర్త ఆగడాలు వేచి చూడండి న్యూస్ తెలంగాణ ఎపిసోడ్ 3 లో )
0Shares

Related posts

క్రికెట్ క్రీడల విజేతలకు బహుమతులు పంపిణి

News Telangana

కాంగ్రెస్ పేరుతో నకిలీ వెబ్ సైట్ ద్వారా క్రౌడ్ ఫండింగ్

News Telangana

సీఎం రేవంత్‌తో ఆర్బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్‌ భేటీ

News Telangana

Leave a Comment