October 18, 2024
News Telangana
Image default
Crime NewsTelangana

ఉరివేసుకొని మహిళ మృతి

ధర్మారం, ఫిబ్రవరి11 (న్యూస్ తెలంగాణ):

పెద్దపెల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని స్థానికురాలు గోల్కొండ రాజేశ్వరి (37) గత కొద్ది సంవత్సరాలుగా మూర్ఛ వ్యాధితో బాధపడుతుంది. ఇదే క్రమంలో వ్యాధి తీవ్రత పెరగడంతో తీవ్ర మనస్థాపనానికి గురై జీవితంపై విరక్తి చెంది శనివారం రోజున సుమారు 9.30 గంటల ప్రాంతంలో ఇంట్లోని వ్యక్తులు నిద్రిస్తున్న సమయంలో తన ఇంటి రేకుల షెడ్డు కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయమై మృతురాలి తల్లి నర్ర వెంకటమ్మ దరఖాస్తు మేరకు కేసు నమోదు చేసినట్లు ధర్మారం మండల రెండవ ఎస్సై ఎస్ అశ్విని తెలిపారు. మృతురాలికి ఒక కూతురు, కుమారుడు ఉన్నారు, మృతురాలి భర్త ఉపాధి కొరకు దుబాయిలో ఉన్నట్లు సమాచారం.

0Shares

Related posts

నేటినుండి మహాలక్ష్మి మహిళలకు జీరో టికెట్: ఆర్టీసీ ఎండి సజ్జనర్

News Telangana

నేటి నుండి శబరిమలకు వందే భారత్ రైలు !

News Telangana

ఊరూరా మీసేవ….!

News Telangana

Leave a Comment