జగిత్యాల :- కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయ ధర్మకర్త మల్యాల మం. రామన్నపేట గ్రామానికి చెందిన పోచమల్ల ప్రవీణ్ తన ధర్మకర్త పదవికి రాజీనామా చేశారు. బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఏర్పడిన ఆలయ ధర్మకర్త పదవిని కాంగ్రెస్ పార్టీ హయాంలో తాను కొనసాగించడం సమంజసం కాదని రాజీనామా చేసినట్లు ఆయన తెలిపారు. ఆలయ ఈవో టంకశాల వెంకటేశ్ ను కలిసి ఆయన రాజీనామా పత్రాన్ని అందజేశారు.