January 19, 2025
News Telangana
Image default
Crime News

దాడికి పాల్పడ్డ వ్యక్తికి జరిమానా తో, పాటు జైలు శిక్ష

ముస్తాబాద్ /న్యూస్ తెలంగాణ దాడిచేసిన వ్యక్తి పై రెండేళ్ల జైలు శిక్ష, రూ.2000 వేల రూపాయలు జరిమానా విధిస్తూ సిరిసిల్ల ప్రధమ శ్రేణి న్యాయ మూర్తి ప్రవీణ్ గురువారం తీర్పునిచ్చారు.

ఎస్‌ఐ శేఖర్ రెడ్డి తెలిన వివరాల ప్రకారం

అక్టోబర్ 4, 2016 రోజున ముస్తాబాద్ మండలం పోత్గల్ గ్రామానికి చెందిన తలారి రాజు అదే గ్రామానికి చెందిన జంగ భూంరాజుల మధ్య చెట్లను కొట్టుకునే విషయంలో గొడవ జరిగింది అని.ఆ గొడవలో భూంరాజు రాయితో రాజు తలపై కొట్టాడని తెలిపారు. తీవ్రంగా గాయపడిన రాజుని వెంటనే ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం నుంచి బయటపడ్డాడు. జరిగిన సంఘటనపై ముస్తాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో చార్జిషీట్ దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్ తరపున పి.పి. చెలుమల సందీప్ వాదించగా, కోర్టు కానిస్టేబుల్ దేవేందర్ సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన న్యాయమూర్తి నేరం రుజువు కావడంతో నిందితుడికి రెండు సంవత్సరాలు జైలు శిక్ష రు 2000 వేల రూపాయల జరిమాన విధించారని ముస్తాబాద్ ఎస్ ఐ. శేఖర్ రెడ్డి తెలిపారు

0Shares

Related posts

పార్లమెంటుపై దాడికి పాల్పడిన ప్రధాన సూత్రధారి అరెస్ట్?

News Telangana

పురుగుల మందు తాగి యువకుడు మృతి

News Telangana

గుంటూరు మున్సిపల్ కమిషనర్‌కు జైలు శిక్ష విధించిన తెలంగాణ హైకోర్టు

News Telangana

Leave a Comment