September 7, 2024
News Telangana
Image default
PoliticalTelangana

జాతర ఏర్పాట్లను పరిశీలించిన డి.ఎస్.పి

గొల్లపల్లి, డిసెంబర్ 16 (న్యూస్ తెలంగాణ):

జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలోని మల్లన్న పేట గ్రామంలో ఈ నెల 18 తేదీ నుండి జరిగే శ్రీ మల్లికార్జున స్వామి జాతరకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించిన జగిత్యాల డి.ఎస్.పి వెంకటరమణ ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని, గ్రామంలోని ప్రధాన కూడలిలో, గుడి పరిసర ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా ఉండాలని, భక్తులకు తాగునీటి సౌకర్యం కల్పించాలని అలాగే ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా గ్రామానికి నాలుగు వైపులా పార్కింగ్ సదుపాయం కల్పించాలని ఆలయ కమిటీ వారికి సూచించారు. ఈ సందర్భంగా మల్లికార్జున స్వామిని దర్శించుకున్న జగిత్యాల డి.ఎస్.పి వెంకటరమణ ను ఆలయ సిబ్బంది ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ కొండూరి శాంతాయ్య, గుడి ఈఓ విక్రమ్, గుడి పూజారి రాజేందర్ శర్మ, ధర్మపురి సిఐ రమణమూర్తి, ధర్మపురి ఎస్సై దత్తాద్రి, గొల్లపల్లి ఎస్సై నరేష్, కానిస్టేబుల్ వేణు, సర్పంచ్ సిద్దంకి నర్సయ్య, ఉప సర్పంచ్ బేరా కిషోర్, సిద్దంకి మల్లారెడ్డి, బండిదేవేందర్, గ్రామ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

0Shares

Related posts

రేపు వారందరికీ సెలవు ప్రకటించిన సిఈవో వికాస్ రాజ్

News Telangana

కుమారి ఆంటీ ఫుడ్ స్టాల్‌కు రక్షణ కల్పించిన రేవంత్ సర్కార్

News Telangana

తంగళ్లపెల్లి ఎస్సై గా ప్రశాంత్ రెడ్డి బాధ్యతలు స్వీకారణ

News Telangana

Leave a Comment