September 8, 2024
News Telangana
Image default
Telangana

సినీ నిర్మాత హత్య కేసు ఎఫెక్ట్ .. ఏసీపీ సుధీర్ బాబు సస్పెండ్

హైదరాబాద్ ( News Telangana ) : సినీ నిర్మాత అంజిరెడ్డి హత్య కేసు విచారణలో పోలీసుల విచారణ తీరుపై అనుమానాలు వచ్చాయి. ఊహించినట్టుగానే నిర్మాత అంజిరెడ్డి రోడ్డు ప్రమాదంలో చనిపోలేదని తెలిసింది. హత్య చేసి దానిని ప్రమాదంగా చిత్రీకరించారని ఆ తర్వాత జరిపిన విచారణలో తేటతెల్లం అయ్యింది. దీంతో గోపాలపురం ఏసీపీ సుధీర్ బాబుపై చర్యలు తీసుకున్నారు. సుధీర్ బాబును హైదరాబాద్ పోలీస్ కమీషనర్ కే శ్రీనివాస రెడ్డి సస్పెండ్ చేశారు. అంతకుముందే గోపాలపురం ఇన్ స్పెక్టర్ మురళి, డీఎస్ఐ దీక్షితులను సస్పెండ్ చేశారు. నిర్మాత అంజిరెడ్డికి రియల్ ఎస్టేట్ మాఫియాతో గొడవలు ఉన్నాయి. భూ వివాద విషయంలో వివాదం కొనసాగుతోంది. దాంతో రియల్ ఎస్టేట్ మాఫియా అంజిరెడ్డిని హతమార్చింది. గోపాలపురం ఏసీపీని రియల్ మాఫియా తమ వైపునకు తిప్పుకుంది. అంజిరెడ్డి హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారు. కుటుంబ సభ్యులు అంజిరెడ్డి మృతిపై సందేహాలు వ్యక్తం చేయడంతో కేసును మరోసారి దర్యాప్తు చేశారు. అంజిరెడ్డి హత్యకు గల కారణాలు తెలిశాయి. హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని వెల్లడైంది. దీంతో ఏసీపీ సుధీర్ బాబును సస్పెండ్ చేశారు

0Shares

Related posts

తెలంగాణలో కొత్త రేషన్ కార్డులకు రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు

News Telangana

శ్రీ సమ్మక్క సారలమ్మ జాతరకు నిధులు కేటాయించండి:మంత్రి కొండ సురేఖ

News Telangana

చింతపల్లి సబ్ఇన్స్పెక్టర్ సతీష్ రెడ్డి సస్పెండ్

News Telangana

Leave a Comment