October 18, 2024
News Telangana
Image default
Telangana

కన్నతల్లిని కడ తేర్చిన కొడుకు

సూర్యాపేట జిల్లా బ్యూరో అనంతగిరి, ఫిబ్రవరి 7(న్యూస్ తెలంగాణ దినపత్రిక): మద్యం మత్తులో కన్నతల్లిని కుమారుడు కడతేర్చిన సంఘటన అనంతగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని తమ్మర బండ పాలెం గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల తమ్మరబండ పాలెం సుందరయ్య నగర్ కు చెందిన పుట్ట బంతి రాములమ్మ (70) గత రెండు సంవత్సరాల క్రితం తన కుమారుడు పుట్ట బంతి వీరేష్​తో కలిసి గరిడేపల్లి మండలం సర్వారం గ్రామము నుండి వలస వచ్చి తమరబండపాలెంలో జీవనం కొనసాగిస్తున్నారు,
వీరేష్​ తాపీ పని చేస్తున్నాడు.కానీ నిత్యం మధ్యనికి బానిసై తల్లిని చిత్రహింసలకు గురి చేసేవాడు. బుధవారం సైతం తాగిన మైకంలో తాగొద్దని వారిచ్చిన తల్లిని గొంతు నులిమి చంపాడు. విషయం తెలుసుకున్న అనంతగిరి ఎస్సె అనిల్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని నిందితుడు వీరేష్​ను అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాన్ని పంచనామ నిమిత్తం కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

0Shares

Related posts

Indian Railways: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. టికెట్​ కన్ఫర్మ్​ అయితేనే డబ్బు చెల్లింపు.. ‘i-Pay’గురించి మీకు తెలుసా?

News Telangana

బడ్జెట్ సమావేశాలకు మాజీ సీఎం కేసీఆర్ రాం రాం

News Telangana

మండల యాదవ సంఘం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ అష్టమి జన్మదిన వేడుకలు

News Telangana

Leave a Comment