తిరుపతి జిల్లా, డిసెంబర్ 01 :-
స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు నాయుడు కీ హైకోర్టులో కాస్త ఊరట లభించింది. దీంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీ వెంకటే శ్వరస్వామి వారిని శుక్రవారం ఉదయం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. చంద్రబాబు దంపతులకు రంగనాయకుల మండ పంలో అర్చకులు వేదాశీర్వచనం పలికారు. అంతకుముందు టీటీడీ అధికారులు చంద్రబాబుకు స్వాగతం పలికారు. దర్శనానికి ఏర్పాట్లు చేశారు. శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మాజీ మంత్రి అమర్నాథరెడ్డి, పెద్ద సంఖ్యలో స్థానిక నేతలు చంద్రబాబు వెంట ఉన్నారు
![Image default](https://newstelangana.in/wp-content/uploads/2023/12/P-IMG-20231201-WA0019.jpg)
previous post
next post