January 19, 2025
News Telangana
Image default
AndhrapradeshPolitical

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు దంపతులు

తిరుపతి జిల్లా, డిసెంబర్ 01 :-
స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న చంద్రబాబు నాయుడు కీ హైకోర్టులో కాస్త ఊరట లభించింది. దీంతో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీ వెంకటే శ్వరస్వామి వారిని శుక్రవారం ఉదయం కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. చంద్రబాబు దంపతులకు రంగనాయకుల మండ పంలో అర్చకులు వేదాశీర్వచనం పలికారు. అంతకుముందు టీటీడీ అధికారులు చంద్రబాబుకు స్వాగతం పలికారు. దర్శనానికి ఏర్పాట్లు చేశారు. శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. మాజీ మంత్రి అమర్నాథరెడ్డి, పెద్ద సంఖ్యలో స్థానిక నేతలు చంద్రబాబు వెంట ఉన్నారు

0Shares

Related posts

అధిష్ఠానానికి సీఎం రేవంత్ కృతజ్ఞతలు

News Telangana

జాతర ఏర్పాట్లను పరిశీలించిన డి.ఎస్.పి

News Telangana

ఘనవిజయం సాధించిన సునీత లక్ష్మారెడ్డి

News Telangana

Leave a Comment