అమరావతి ( News Telangana ) : రాష్ట్రంలో ఇంటర్ పబ్లిక్ పరీక్షలను మార్చి ఒకటో తేదీ నుంచి నిర్వహించాలని ఇంటర్మీడియట్ విద్యామండలి ప్రాథమికంగా నిర్ణయిం చింది. ప్రాక్టికల్స్, వొకేషనల్, థియరీ పరీక్షలను మార్చి 20లోపు పూర్తి చేసేలా షెడ్యూల్ రూపొందించారు. 21వ తేదీ నుంచి పదో తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. సాధారణ ఎన్నికల నోటిఫికేషన్ మార్చిలో వచ్చే అవకాశం ఉన్నందున.. పరీక్షల షెడ్యూల్ ను రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేశ్ కుమార్ మీనాతో అధికారులు చర్చిస్తున్నారు. పదో తరగతి పరీక్షల్లో సామాన్యశాస్త్రానికి రెండు పేపర్లు ఉండటంతో ఏడు పేపర్లతో పరీక్షలు నిర్వహించనున్నారు. ఒక పరీక్ష పూర్తయిన మరుసటిరోజు సెలవు ఇవ్వాలా.. వద్దా అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది
![Image default](https://newstelangana.in/wp-content/uploads/2023/12/IMG-20231211-WA0001.jpg)
previous post