News Telangana :-
కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అయోధ్యలో జనవరి 22వ తారీఖున శ్రీరామ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమం జరపనుంది. ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిధిగా భారత దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పాల్గొంటారు. వీరితోపాటు దేశంలో ఉన్న 8 వేల మంది ప్రముఖులకు ఆహ్వానం పంపడం జరిగినది. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో మెగాస్టార్ చిరంజీవికి శ్రీరామ మందిర ప్రారంభోత్సవ ఆహ్వాన పత్రిక అందింది.