బాపట్ల ( News Telangana ) : ఈ రోజు బాపట్ల, గుంటూరు జిల్లాల్లో టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు పర్యటించనున్నారు. మిచౌంగ్ తుపాను ప్రభావిత ప్రాంతాల్లో రెండవ రోజు పర్యటించనున్నారు. ఉదయం 10.30 గంటలకు బాపట్ల జిల్లా పర్చూరు మండలం చెరుకూరులో దెబ్బతిన్న పంటలను పరిశీలించనున్నారు. 12 గంటలకు పర్చూరు డ్రైన్ను పరిశీలించనున్నారు. 2.20 గంటలకు గుంటూరు జిల్లా పత్తిపాడు మండలంలోని చిన్ననందిపాడు, పెద్ద నందిపాడు లో దెబ్బతిన్న పంటలు పరిశీలన చేయనున్నారు. 3.30 గంటలకు పెద్ద నందిపాడు గ్రామంలో రైతులతో చంద్రబాబు సమావేశం కానున్నారు. రైతులతో సమావేశం అనంతరం ఉండవల్లికి బయలుదేరి వెళ్ళనున్నారు
![Image default](https://newstelangana.in/wp-content/uploads/2023/12/IMG-20231209-WA0051.jpg)
previous post