October 18, 2024
News Telangana
Image default
National

భారతీయులకు గుడ్‌న్యూస్‌.. ఇక అమెరికాలోనే వీసా రెన్యువల్‌.!

న్యూస్ తెలంగాణ డెస్క్ :- అమెరికాలో పనిచేస్తున్న భారత టెక్‌ నిపుణులకు అగ్రరాజ్యం గుడ్‌న్యూస్‌ చెప్పింది. స్వదేశాలకు వెళ్లకుండానే ఎన్నారైలు తమ హెచ్‌-1బీ వీసాలను రెన్యువల్‌ చేసుకునేలా ఓ పైలట్ ప్రోగ్రామ్‌ను డిసెంబరు నుంచి అందుబాటులోకి తీసుకొస్తోంది. హెచ్‌-1బీ వీసా పునరుద్ధరణ విధానాన్ని మరింత సరళీకరించేలా అమెరికా ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంది. మూడు నెలల పాటు ఈ ప్రోగ్రామ్‌ అందుబాటులో ఉంటుందని వీసా సేవల డిప్యూటీ అసిస్టెంట్‌ సెక్రటరీ జూలీ స్టఫ్‌ వెల్లడించారు. తొలుత 20వేల మందికి ఈ పైలట్‌ ప్రోగ్రామ్‌ కింద వీసా రెన్యువల్‌ చేయనున్నారు. ఈ ప్రోగ్రామ్‌ ద్వారా ఎక్కువ శాతం భారతీయులకు ప్రయోజనం చేకూరుతుందని జూలీ వెల్లడించారు. భారతీయ ప్రయాణికులకు వీలైనంత త్వరగా వీసా అపాయింట్‌మెంట్‌లు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని, అందులో ఇదీ ఒకటని జూలీ పేర్కొన్నారు. డిసెంబరు నుంచి మూడు నెలల పాటు అమెరికాలో ఉంటున్న హెచ్‌-1బీ వీసాదారులు.. వారి స్వదేశాలకు వెళ్లకుండానే వీసాలను రెన్యువల్‌ చేసుకోవచ్చన్నారు. పైలట్‌ ప్రోగ్రామ్‌ కింద తొలుత 20వేల మందికి వీసాలను ఇక్కడే పునరుద్ధరిస్తామని తెలిపారు. ఇందులో మెజార్టీ భాగం భారతీయులే ఉంటారని తెలిపారు. క్రమక్రమంగా ఈ ప్రోగ్రామ్‌ను విస్తరిస్తామని జూలీ వెల్లడించారు. దీంతో భారత్‌లోని అమెరికా దౌత్య కార్యాలయాలు మరిన్ని కొత్త దరఖాస్తులపై ఫోకస్‌ పెట్టే అవకాశం ఉంటుందన్నారు. ప్రస్తుతానికి ఈ ప్రోగ్రామ్‌ను కేవలం హెచ్‌-1బీ కేటగిరీ వర్క్‌ వీసాలకు మాత్రమే అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు స్పష్టం చేశారు. త్వరలోనే దీనిపై అధికారిక నోటీసులు జారీ చేస్తామని, ఈ వీసా రెన్యువల్‌కు ఎవరు అర్హులు? ఎలా దరఖాస్తు చేసుకోవాలి? అన్న వివరాలను వెల్లడిస్తామని తెలిపారు.

0Shares

Related posts

కన్నడ సీనియర్ నటి లీలావతి కన్నుమూత

News Telangana

తెలంగాణ ఫలితాలపై ప్రధాని ట్వీట్

News Telangana

పార్లమెంటుపై దాడికి పాల్పడిన ప్రధాన సూత్రధారి అరెస్ట్?

News Telangana

Leave a Comment